నమస్కారం.,
మనదైన సంస్కృతి బ్లాగు మొదలుపెట్టి, 5-6యేళ్లపైనే అయినా, ఋగ్వేద సంధ్యావందనం తప్పితే, మఱొక పోస్టు వేయలేదు. విషయపరిజ్ణానం అంతగా లేకపోవడం ముఖ్యకారణం అయితే, టైం దొరక్కపోవడం ఇంకొక చిన్న కారణం.
ఇకపైన, ఈ బ్లాగులో తెలుగు కవులు రాసిన గ్రంథాల నుండి వివిధ దేవీదేవతల గుఱించి పద్యాలను సేకరించి ఉంచాలని ఉద్దేశ్యంతో మళ్ళీ ఈ బ్లాగుని మళ్ళీ వినియోగిస్తున్నాను. ఇందుకు గల కారణాలు.
1) నాకు తెలిసున్నంతవరకు, మన తెలుగు మతభాష కాదు. అంటే మనగుళ్ళలో చదివే మంత్రాలలో, సంస్కృతమే తప్ప, తెలుగు ఎక్కడో కానీ కనబడదు. తెలుగువాళ్ళు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించాలంటే, సంస్కృతమే కావాలి. మతభాష గురించి, ఇంకొంచెం తెలుసుకోవాలంటే, మన పొరుగునున్న భాషలగురించి, నాకున్న తెలిసున్న నాలుగైదు మాటలు రాస్తాను.
తమిళం: వైష్ణవ సంప్రదాయంలో తమిళానికి, సంస్కృతంతో సమానమైన స్థానమున్నది. తిరుమల వేంకటేశ్వరుని గుడి గోడలను చూస్తేనే ఈ సంగతి మనకు అర్థమై ఉంటుంది. గుడిగోడల మీద శిల్పుల కోడింగ్ తెలుగు (లిపి)లో ఉంటే, శాసనాలూ, స్తుతులు సంస్కృత, తమిళ భాషలలోనే ఎక్కువగా ఉంటుంది. కట్టిన శిల్పులు మన తెలుగువారు, కానీ మన తెలుగు గుడి చరిత్రకి ఎక్కడానికి, విజయనగర కాలం వఱకూ సమయం పట్టింది. గుడిపైనున్న శాసనాల్లో, అన్నిటి కన్నా ప్రాచీనమైనది క్రీ.శ 9 వ శతాబ్దానికి చెందిన పల్లవరాణి "సామవై" వేయించిన తమిళ శాసనం.
తమిళనాడే కాక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న అన్ని విష్ణ్వాలయాల్లోనూ ధనుర్మాసం సందర్భంగా, చదివే తిరుప్పావై పాశురాలు, తమిళ భాషలోవేనన్న విషయం మనకందరికీ తెలుసు. అవికాక, పాతకాలంనాటి గుళ్లన్నిటిలోనూ, "ద్రవిడవేదం" చదువుతారు.
కన్నడం: లింగాయతులకు, కన్నడభాషలోని "వచన సాహిత్యం" విశిష్టమైనది. తెలుగులోని "బసవ పురాణం" (పాల్కురికి సోమనాధుడు) కూడా ముఖ్యగ్రంథమైనప్పటికీ, దాని కన్నడ అనువాదమే కన్నడిగులకి ఎక్కువగా పరిచయం. నేటి కర్నాటకకి వెలుపల ఉన్న కేదార్ నాధ్, ఉజ్జయిని, శ్రీశైలం లలో ఉన్న వీరశైవ పీఠాలలో కన్నడ ముఖ్యభాష. కేదార్ నాథ్ గుడిలో సైతం, కన్నడ భాషలో పూజ జరిగే సంప్రదాయం ఉందన్నది, చాలా కొద్ది మందికే తెలుసు.
హిందీవారికి "చాలీసా"లు, సాయిబాబా గుళ్ళలో మరాఠీ భాషలు సేవలు.
తెలుగువారికి ఒక్క దండక సాహిత్యంలో మాత్రమే ఇష్టదైవాన్ని కొలవడం మనం చూస్తాం. ఇవికాక, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు కీర్తనలు, వంటివి గానం చేయడం ఉంది. అయితే, తెలుగు గ్రంథాల పఠనం, ఒక సంప్రదాయంగా లేదు.
2) మన భాషలో ప్రతిరోజు చేసుకునేందుకు సైతం, మనం సంస్కృతాన్నే వినియోగిస్తాము. అందుకే మనకున్న సాహిత్యంలోనుండి, కొన్నిటిని సేకరించి, అంతర్జాలంలో అందుబాటులో ఉంచేందుకు ఈ చిన్న ప్రయత్నం.
3) నిజానికి ఒక సంప్రదాయాన్ని ప్రారంభించాలన్నా, మార్పుచేర్పులు చేయాలన్నా, సర్వసంగపరిత్యాగులు, సన్యాసులు, పీఠాధిపతులు పూనుకోవాల్సి ఉంటుంది. తప్పితే, నాబోటి సాధారణ గృహస్థునికి, ఎంతో కషమైనదని తెలుసు.
4) అయితే, ఈ ప్రయత్నం చేయడం వలన, కొద్దిమందికైనా ఈ అలోచన పంచుకున్నవాణ్ణవుతానని ఆశితున్నాను. కనీసం ఒక్కరికి ఈ ఆలోచన కరెక్టనిపించినా, ఈ ప్రయత్నం విజయవంతమైనట్టుగా భావిస్తాను.
5) ఇందులో, రోజుకో పద్యం చొప్పున, యేడాది పాటు సేకరించాలని, ఇప్పటికి లక్ష్యంగా పెట్టుకుంటున్నాను.
6) ఇందులో ఉంచే పద్యాలుగానీ, ఇతర సాహిత్యం గానీ, నా సొంతది కాదు. నా సొంత పద్యాలు రాసే స్థాయి నాకిప్పటికీ లేదు. భవిష్యత్తులోనైనా వస్తుందని ఆశిస్తున్నాను.
ఈ ప్రయత్నాన్ని, మనకు లభిస్తున్న తెలుగు సాహిత్యంలో మొదటిదయిన "ఆంధ్ర మహాభారతం" లోని సంస్కృత శ్లోకంతోనే ప్రారంభిస్తున్నాను.
శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాఙ్గేషు యే
లోకానాం స్థితిమావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్,
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషాస్సంపూజితా వ స్సురై
ర్భూయాసు: పురుషోత్త మామ్హుజభవ శ్రీకన్ధరా శ్శ్రేయసే
అటుపైన మా మునిముత్తాతగారు సాలగ్రామ చింతామణి కవి గారు రచించిన "సిరియాళ చరిత్రము"లోని పద్యాలతో పోస్టులను వేయదలుచుకున్నాను.
నెనరులు
మనదైన సంస్కృతి బ్లాగు మొదలుపెట్టి, 5-6యేళ్లపైనే అయినా, ఋగ్వేద సంధ్యావందనం తప్పితే, మఱొక పోస్టు వేయలేదు. విషయపరిజ్ణానం అంతగా లేకపోవడం ముఖ్యకారణం అయితే, టైం దొరక్కపోవడం ఇంకొక చిన్న కారణం.
ఇకపైన, ఈ బ్లాగులో తెలుగు కవులు రాసిన గ్రంథాల నుండి వివిధ దేవీదేవతల గుఱించి పద్యాలను సేకరించి ఉంచాలని ఉద్దేశ్యంతో మళ్ళీ ఈ బ్లాగుని మళ్ళీ వినియోగిస్తున్నాను. ఇందుకు గల కారణాలు.
1) నాకు తెలిసున్నంతవరకు, మన తెలుగు మతభాష కాదు. అంటే మనగుళ్ళలో చదివే మంత్రాలలో, సంస్కృతమే తప్ప, తెలుగు ఎక్కడో కానీ కనబడదు. తెలుగువాళ్ళు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించాలంటే, సంస్కృతమే కావాలి. మతభాష గురించి, ఇంకొంచెం తెలుసుకోవాలంటే, మన పొరుగునున్న భాషలగురించి, నాకున్న తెలిసున్న నాలుగైదు మాటలు రాస్తాను.
తమిళం: వైష్ణవ సంప్రదాయంలో తమిళానికి, సంస్కృతంతో సమానమైన స్థానమున్నది. తిరుమల వేంకటేశ్వరుని గుడి గోడలను చూస్తేనే ఈ సంగతి మనకు అర్థమై ఉంటుంది. గుడిగోడల మీద శిల్పుల కోడింగ్ తెలుగు (లిపి)లో ఉంటే, శాసనాలూ, స్తుతులు సంస్కృత, తమిళ భాషలలోనే ఎక్కువగా ఉంటుంది. కట్టిన శిల్పులు మన తెలుగువారు, కానీ మన తెలుగు గుడి చరిత్రకి ఎక్కడానికి, విజయనగర కాలం వఱకూ సమయం పట్టింది. గుడిపైనున్న శాసనాల్లో, అన్నిటి కన్నా ప్రాచీనమైనది క్రీ.శ 9 వ శతాబ్దానికి చెందిన పల్లవరాణి "సామవై" వేయించిన తమిళ శాసనం.
తమిళనాడే కాక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న అన్ని విష్ణ్వాలయాల్లోనూ ధనుర్మాసం సందర్భంగా, చదివే తిరుప్పావై పాశురాలు, తమిళ భాషలోవేనన్న విషయం మనకందరికీ తెలుసు. అవికాక, పాతకాలంనాటి గుళ్లన్నిటిలోనూ, "ద్రవిడవేదం" చదువుతారు.
కన్నడం: లింగాయతులకు, కన్నడభాషలోని "వచన సాహిత్యం" విశిష్టమైనది. తెలుగులోని "బసవ పురాణం" (పాల్కురికి సోమనాధుడు) కూడా ముఖ్యగ్రంథమైనప్పటికీ, దాని కన్నడ అనువాదమే కన్నడిగులకి ఎక్కువగా పరిచయం. నేటి కర్నాటకకి వెలుపల ఉన్న కేదార్ నాధ్, ఉజ్జయిని, శ్రీశైలం లలో ఉన్న వీరశైవ పీఠాలలో కన్నడ ముఖ్యభాష. కేదార్ నాథ్ గుడిలో సైతం, కన్నడ భాషలో పూజ జరిగే సంప్రదాయం ఉందన్నది, చాలా కొద్ది మందికే తెలుసు.
హిందీవారికి "చాలీసా"లు, సాయిబాబా గుళ్ళలో మరాఠీ భాషలు సేవలు.
తెలుగువారికి ఒక్క దండక సాహిత్యంలో మాత్రమే ఇష్టదైవాన్ని కొలవడం మనం చూస్తాం. ఇవికాక, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు కీర్తనలు, వంటివి గానం చేయడం ఉంది. అయితే, తెలుగు గ్రంథాల పఠనం, ఒక సంప్రదాయంగా లేదు.
2) మన భాషలో ప్రతిరోజు చేసుకునేందుకు సైతం, మనం సంస్కృతాన్నే వినియోగిస్తాము. అందుకే మనకున్న సాహిత్యంలోనుండి, కొన్నిటిని సేకరించి, అంతర్జాలంలో అందుబాటులో ఉంచేందుకు ఈ చిన్న ప్రయత్నం.
3) నిజానికి ఒక సంప్రదాయాన్ని ప్రారంభించాలన్నా, మార్పుచేర్పులు చేయాలన్నా, సర్వసంగపరిత్యాగులు, సన్యాసులు, పీఠాధిపతులు పూనుకోవాల్సి ఉంటుంది. తప్పితే, నాబోటి సాధారణ గృహస్థునికి, ఎంతో కషమైనదని తెలుసు.
4) అయితే, ఈ ప్రయత్నం చేయడం వలన, కొద్దిమందికైనా ఈ అలోచన పంచుకున్నవాణ్ణవుతానని ఆశితున్నాను. కనీసం ఒక్కరికి ఈ ఆలోచన కరెక్టనిపించినా, ఈ ప్రయత్నం విజయవంతమైనట్టుగా భావిస్తాను.
5) ఇందులో, రోజుకో పద్యం చొప్పున, యేడాది పాటు సేకరించాలని, ఇప్పటికి లక్ష్యంగా పెట్టుకుంటున్నాను.
6) ఇందులో ఉంచే పద్యాలుగానీ, ఇతర సాహిత్యం గానీ, నా సొంతది కాదు. నా సొంత పద్యాలు రాసే స్థాయి నాకిప్పటికీ లేదు. భవిష్యత్తులోనైనా వస్తుందని ఆశిస్తున్నాను.
ఈ ప్రయత్నాన్ని, మనకు లభిస్తున్న తెలుగు సాహిత్యంలో మొదటిదయిన "ఆంధ్ర మహాభారతం" లోని సంస్కృత శ్లోకంతోనే ప్రారంభిస్తున్నాను.
శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాఙ్గేషు యే
లోకానాం స్థితిమావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్,
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషాస్సంపూజితా వ స్సురై
ర్భూయాసు: పురుషోత్త మామ్హుజభవ శ్రీకన్ధరా శ్శ్రేయసే
అటుపైన మా మునిముత్తాతగారు సాలగ్రామ చింతామణి కవి గారు రచించిన "సిరియాళ చరిత్రము"లోని పద్యాలతో పోస్టులను వేయదలుచుకున్నాను.
నెనరులు
No comments:
Post a Comment