అదే కైవడిలో, విష్ణమూర్తి పది అవతారాల గురించి వర్ణించే కీర్తనల గురించిన కొన్ని కీర్తనలు ఇవి.
1. ఇందరికి అభయంబు లిచ్చు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ||
వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి |
కలికియగు భూకాంత కౌగిలించిన చేయి
వలనైన కొనగోళ్ళ వాడిచేయి ||
తనివోక బలి చేత దానమడిగిన చేయి
ఒనరంగ భూ దాన మొసగు చేయి |
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
యనయ నాగేలు ధరియించు చేయి ||
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి |
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
పల్లవి
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా ॥
చరణాలు
పొలసు మేనివాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెకా ।
గొలుసుల వంకల కోరలతోబూమి
వెలిసినాడు సూడవే సిన్నెకా ॥
మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి
సీటకాలవాడు సిన్నెకా ।
ఆటదానిబాసి అడవిలో రాకాశి
వేటలాడీ జూడవే సిన్నెకా ॥
బింకపు
మోతల పిల్లగోవివాడు
సింక సూపులవాడు సిన్నెకా ।
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుడు సూడవే సిన్నెకా ॥
3. తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు
పల్లవి
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ।
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ॥
చరణాలు
మోతనీటి మడుగులో యీతగరచినవాడు ।
పాతగిలే నూతిక్రింద బాయనివాడు ।
మూతిదోసిపట్టి మంటి ముద్ద పెల్లగించువాడు ।
రోతయైన పేగుల పేరులు గలవాడు ॥
కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు ।
బూడిద బూసినవాని బుద్ధులవాడు ।
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు ।
దూడల నావులగాచి దొరయైనవాడు ॥
ఆకసానబారే వూరి అతివల మానముల ।
కాకుసేయువాడు తురగముపైవాడు ।
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి ।
యేకాలముబాయని యెనలేనివాడు ॥
4. పుడమి నిందరి బట్టె భూతము
పల్లవి
పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము ||
చరణాలు
చేటకాళ్ళ మించినభూతము |
గాటపుజడల బింకపుభూతము |
కెలసి బిత్తలేతిరిగేటి భూతము |
బలుపు వేంకటగిరిపై భూతము |
దశావతారాల ప్రస్తావనలు కలిగిన కీర్తనల్లో నాకు తెలిసున్నవి, వినేవి ఇవి.
No comments:
Post a Comment